News February 6, 2025

భువనగిరి లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

image

భువనగిరిలోని పలు లాడ్జీలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేరా, డాల్ఫిన్, ఎస్వీ, ఎస్ఆర్ లాడ్జీలను చెక్ చేశామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటున్నారా అని లాడ్జి యాజమాన్యాన్ని ఆరా తీసినట్లు చెప్పారు. MLC ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లైతే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, కుమారస్వామి పాల్గొన్నారు.

Similar News

News December 17, 2025

రైతు బజార్‌లో ఫిర్యాదుల బాక్స్ ఓపెన్: జేసీ

image

భీమవరం రైతు బజార్‌లో ధరలు, సౌకర్యాలపై ప్రజాభిప్రాయ సేకరణ సంతృప్తికరంగా ఉందని JC రాహుల్ పేర్కొన్నారు. బుధవారం రైతు బజార్‌లోని ఫిర్యాదుల పెట్టెను తెరిచి ప్రజల అభిప్రాయాలను ఆయన స్వయంగా పరిశీలించారు. వినియోగదారుల సూచనల మేరకు త్వరలోనే సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, ప్రతి స్టాల్‌కు నంబర్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కూరగాయల ధరలను ఎప్పటికప్పుడు బోర్డులపై ప్రదర్శించాలని ఆయన కోరారు.

News December 17, 2025

నవంబర్‌లో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు!

image

యాపిల్ సరికొత్త మైలురాయిని చేరుకుంది. NOVలో $2 బిలియన్ల విలువైన ఐఫోన్లను భారత్ ఎగుమతి చేసినట్లు బిజినెస్ వర్గాలు తెలిపాయి. దేశంలో మొత్తం స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లో ఇది 75శాతమని, FY26లో 8 నెలల్లోనే ఎగుమతులు $14 బిలియన్ దాటినట్లు పేర్కొన్నాయి. ఐఫోన్ తయారీ కేంద్రాలు పెరగడం దీనికి కారణమని భావిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఎగుమతులు FY25లో ఏప్రిల్-నవంబర్‌తో పోలిస్తే ఈ FYలో 43% వృద్ధి సాధించాయని పేర్కొన్నాయి.

News December 17, 2025

పాలమూరు: కూతురుపై తండ్రి విజయం

image

నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని కోల్పూర్ గ్రామపంచాయతీకి నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తండ్రికూతుళ్లు పోటీపడ్డారు. బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో తండ్రి ముద్ద రాములు 420 ఓట్ల మెజార్టీతో కూతురుపై విజయం సాధించారు. తండ్రికూతుర్ల మధ్య పోటీలో తండ్రినే విజయం వరించింది. తన గెలుపునకు సహకరించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.