News February 20, 2025
భూపాలపల్లిలో దారుణ హత్య.. భూ వివాదమే కారణమా?

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు జిల్లా కేంద్రంలోని ఓ భూవివాదమే కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
పెద్దపల్లి: ‘నన్ను గెలిపిస్తే.. ఆరోగ్య బీమా చేయిస్తా’

పల్లె సంగ్రామంలో అభ్యర్థులు ఊహకందని హామీలతో ఓటర్లను ఆశ్చర్యపరుస్తున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలోని ఆటో డ్రైవర్లు, హామాలీలకు ఆరోగ్య భీమా చేయిస్తానంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్కు చెందిన సర్పంచ్ అభ్యర్థి ఆకుల మణి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. యాక్సిడెంట్లతో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో ఆరోగ్య బీమాను ఎంచుకున్నట్లు చెబుతోంది.
News December 13, 2025
ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.
News December 13, 2025
వాటిని పెద్దగా పట్టించుకోను: వైభవ్ సూర్యవంశీ

2025లో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయుడిగా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ నిలిచారు. ఈ క్రమంలో పాపులారిటీలో కోహ్లీని కూడా దాటేశారన్న వార్తలపై వైభవ్ స్పందించారు. ‘వీటిని పెద్దగా పట్టించుకోను. నా దృష్టి ఆటపైనే. ఇలాంటి వార్తలు విన్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. వాటిని చూసి ఆనందపడతాను. తర్వాత పనిలో పడిపోతా’ అని చెప్పారు. UAEతో మ్యాచ్లో వైభవ్ 171(95) పరుగులతో <<18542043>>విధ్వంసం<<>> సృష్టించారు.


