News March 25, 2025
మంచిర్యాల: మంచిగా పని చేస్తే గుర్తింపు వస్తుంది: CP

చట్టబద్ధంగా మంచిగా పని చేసినప్పుడు తప్పక గుర్తింపు వస్తుందని CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. నెలవారి సమీక్షలో భాగంగా సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. CPమాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై స్టేషన్ అధికారులకు ముందస్తు సమాచారం ఉండాలన్నారు. ప్రతి కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, SC,ST కేసుల్లో న్యాయంగా, పారదర్శకంగా విచారణ జరపాలని సూచించారు.
Similar News
News March 28, 2025
పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

☞ నరసరావుపేట: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు,. ☞ సత్తనపల్లి: బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక. ☞ చిలకలూరిపేట: పరీక్షా కేంద్రంలో ఉపాధ్యాయుడికి పాముకాటు. ☞ మాచర్ల: సినిమా థియేటర్లో ఆర్డీఓ తనిఖీలు. ☞ క్రోసూరు: కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ☞ దాచేపల్లి: సిమెంట్ ఫ్యాక్టరీల ప్రభావిత గ్రామాలలో అధికారుల పర్యటన.
News March 28, 2025
ఓబుళాపురం మైనింగ్ కేసుపై మే 6న తీర్పు

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఓబుళాపురం మైనింగ్ కేసు(OMC)లో ఎట్టకేలకు విచారణ ముగిసింది. మే 6న తీర్పు వెల్లడించనున్నట్లు CBI కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితులుగా గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. 219 సాక్షులను విచారించడంతోపాటు 3,337 డాక్యుమెంట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2009 నుంచి ఈ కేసు కొనసాగుతోంది.
News March 28, 2025
తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీక: కేటీఆర్

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్దనగర్ డివిజన్లోని వారసిగూడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కే.టీ.రామారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు సర్వ మత సౌభ్రాతృత్వాన్ని చాటుతాయని అన్నారు. తెలంగాణ అన్ని మతాల ప్రజల సహా జీవనానికి ప్రతీకని చెప్పారు.