News April 7, 2025
మంచిర్యాల: యాక్సిడెంట్లో విద్యార్థి మృతి

రోడ్డుప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన ఘటన హన్మకొండ జిల్లా హసన్పర్తిలో జరిగింది. SI దేవెందర్ వివరాలు.. నస్పూర్కి చెందిన ఉదయ్ ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం స్నేహితురాలు రజితతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనానికి బైక్ పై వెళ్తుండగా నల్లగట్టుగుట్ట సమీపంలో ఓ వాహనం ఢీకొంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా MGMలో చికిత్స పొందుతూ ఉదయ్ నిన్న సాయంత్రం మృతి చెందాడు.
Similar News
News April 18, 2025
HYD: మెట్రో నిర్మాణానికి జపాన్ సాయం..!

HYD మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి TG రాష్ట్ర ప్రభుత్వం, జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(JICA)ను ఆర్థిక సహాయాన్ని కోరింది. TG, JICA మధ్య టోక్యోలో హై లెవెల్ మీటింగ్ జరిగినట్లుగా HYD మెట్రో సంస్థ తెలిపింది. రాష్ట్ర, కేంద్ర వాటాలతో మెట్రో ఫేజ్-2 రూ.24,269 కోట్లతో నిర్మించనున్నామని, ప్రాజెక్టులో 48% రూ.11,693 కోట్లు రుణంగా అందించాలని TG కోరినట్లు తెలిపారు. మెట్రో MD NVS రెడ్డి ఉన్నారు.
News April 18, 2025
టెన్త్, ఐటీఐ అర్హతతో NCLలో 200 ఉద్యోగాలు

నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 200 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 10 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పాసైనవారు అర్హులు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. OBC/EWS/UR అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు రూ.1,180(మిగతా కేటగిరీలకు మినహాయింపు). CBT ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News April 18, 2025
BRS నేతలతో కేసీఆర్ సమావేశం

TG: బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి కేసీఆర్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.