News February 25, 2025

మంచిర్యాల: సింగరేణి కార్మికులకు 2 గంటలు పర్మిషన్

image

ఈ నెల 27న జరగనున్న తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన సింగరేణి ఉద్యోగులకు విధుల్లో నుంచి 2 గంటలు మినహాయింపు ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలో అర్హులైన పట్టభద్రులు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.

Similar News

News February 25, 2025

బీఆర్ఎస్ స్కాంలన్నీ సీబీఐకి అప్పగించండి: బండి సంజయ్

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో KCR కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సీఎం రేవంత్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పైకి తిడుతున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు స్కాంలపై మాట్లాడిన వాఖ్యలు చూస్తే ఆయన సీఎంగా ఉన్నారా? లేక మేము ఉన్నామా? అనే అనుమానం వస్తుందన్నారు. బీఆర్ఎస్ స్కాంలను సిబిఐకి అప్పగించాలనన్నారు.

News February 25, 2025

తిరుపతి: ప్రొఫెసర్‌నే మోసం చేశారు..!

image

సైబర్ నేరగాళ్లు తిరుపతి SVUలో ఓ ప్రొఫెసర్‌ను బురిడీ కొట్టించారు. ఆయన ఫోన్ నంబర్‌ను A7*VIP Sharekhan కమ్యూనికేషన్ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తూ లాభాలు పొందవచ్చని ఆశ చూపారు. దీంతో ఆయన వివిధ ఖాతాల నుంచి రూ.25 లక్షలు పంపగా.. కేటుగాళ్లు ప్రొఫెసర్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో విలువ రూ.2.15 కోట్లుగా చూపించారు. డబ్బును విత్ డ్రా చేయగా రాకపోవడంతో మోసపోయినట్లు ఆయన గుర్తించారు.

News February 25, 2025

NLG: క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

image

☞ఎవరికాలంలో నల్గొండ నీలగిరిగా ప్రసిద్ధి చెందింది?
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు?
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం?
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?

నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.

SHARE IT..

error: Content is protected !!