News March 21, 2025

మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

image

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. షహనాజ్ మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సానుభూతిని తెలిపారు. కాగా, కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ హైదరాబాద్‌లోని వారి నివాసంలో మృతిచెందారు.

Similar News

News March 22, 2025

నేడు ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ రాక

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నీటి కుంటల పనులను ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

News March 22, 2025

వృద్ధురాలిపై అత్యాచారయత్నం

image

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు మధ్యాహ్నం తన కల్లంలో నిద్రిస్తుండగా ఓ వ్యక్తి అక్కడికొచ్చి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి రాగానే.. అతడు పరారయ్యాడు. పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2025

కర్నూలు: జిల్లా కోర్టుల్లో “మధ్యవర్తిత్వం” కేంద్రాలు ఏర్పాటు

image

సుప్రింకోర్ట్ ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం కేంద్రాలు ప్రవేశ పెట్టాలని తీర్మానించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్ది తెలిపారు. జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో న్యాయవాదులకు జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అధితిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కభర్ది హాజరై మాట్లాడారు.

error: Content is protected !!