News March 18, 2025

మంత్రి వర్గ సమావేశంలో మంత్రి గుమ్మిడి

image

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న కీలక నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపారని ఆమె తెలిపారు.

Similar News

News March 18, 2025

హైడ్రా పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు: రంగనాథ్

image

TG: హైడ్రా పేరు చెప్పి లావాదేవీలు, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. దీనిపై గతంలోనే ప్రకటన చేశామని, ఇప్పటికే హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇలా ఎవరైనా మోసపోతే తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం లేదా స్థానిక పోలీసులనూ ఆశ్రయించవచ్చన్నారు.

News March 18, 2025

NZB: ఇంటర్ పరీక్షలకు 475 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు 2వ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 475 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో మొత్తం 16,766 మంది విద్యార్థులకు గాను 16,291 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. మొత్తం 95.9 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు.

News March 18, 2025

ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

error: Content is protected !!