News February 7, 2025
మంత్రి సంధ్యారాణికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738903592576_697-normal-WIFI.webp)
మొదటిసారి MLAగా గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి చంద్రబాబు క్యాబినేట్లో మహిళా& శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20 ర్యాంక్ ఇవ్వగా.. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి 3వ ర్యాంక్ సాధించారు. మరి సంధ్యారాణి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?
Similar News
News February 7, 2025
విశాఖ: ఎమ్మెల్సీ స్థానానికి మరో మూడు నామినేషన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738916644500_20522720-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు సంబంధిత పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు చేశారు. వారిలో నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.
News February 7, 2025
PPM: మన్యం జిల్లా ఆశావాహ జిల్లాల్లో అగ్రస్థానంలో ఉండాలి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738920268099_50022931-normal-WIFI.webp)
పార్వతీపురం మన్యం దేశంలోని ఆశావాహ జిల్లాల్లో అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆశావాహ జిల్లాల విభాగంలో పార్వతీపురానికి ప్రధానమంత్రి అవార్డు రావాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది భామిని బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తిని బ్లాక్తో పాటు జిల్లాలోనూ కొనసాగించాలన్నారు.
News February 7, 2025
సంగారెడ్డి: పది విద్యార్థులకు అల్పాహారం నిధులు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738909330927_52434823-normal-WIFI.webp)
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం నిధులు విడుదల చేసిందని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున రోజు సాయంత్రం అల్పాహారం అందించేందుకు విద్యార్థికి రూ.15 చొప్పున జిల్లాలో 7,757 మంది విద్యార్థులకు 38 రోజులకు గాను రూ.44,21,490 ను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.