News March 15, 2025
మందమర్రి: GREAT.. గ్రూప్- 2,3,4 సాధించిన తిరుపతి

మందమర్రి ప్రాణహిత కాలానికి చెందిన <<15738168>>బొడ్డు తిరుపతి గ్రూపు- 4, 2, 3లలో సత్తాచాటి<<>> పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 2016లో సింగరేణి నిర్వహించిన JMET ప్రవేశ పరీక్ష రాసి ఉద్యోగం సాధించాడు. తర్వాత గ్రూపు-4 పరీక్ష రాసి ఎన్నికై క్యాతనపల్లి మునిసిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయి 77 ర్యాంక్, తాజాగా విడుదలైన గ్రూప్-3ఫలితాల్లో రాష్ట్రస్థాయి 60వ ర్యాంకు సాధించాడు.
Similar News
News March 15, 2025
జనం ఛీ కొట్టినా.. జగన్ మారట్లేదు: మంత్రి లోకేశ్

AP: వైసీపీ రాక్షస మూకల దాడిలో మృతిచెందిన చిత్తూరు(D) కృష్ణాపురానికి చెందిన TDP కార్యకర్త రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ కుమారుడు సురేశ్కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. జనం ఛీ కొట్టినా మాజీ CM జగన్ హత్యా రాజకీయాలు మానడం లేదని మండిపడ్డారు. YCP రక్తచరిత్రకు TDP సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.
News March 15, 2025
జనసేనను బీజేపీలో విలీనం చేయడం మంచిది: తులసి రెడ్డి

జనసేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి పవన్ కళ్యాణ్కు సూచించారు. శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మొదటి నుంచి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ల ముగ్గురూ కీలు బొమ్మలని అన్నారు. అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందన్నారు.
News March 15, 2025
ప్లాస్టిక్ వాడకండి: నన్నయ వీసీ

పర్యావరణానికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆమె క్యాంపస్ను శుభ్రం చేశారు. అనంతరం ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు.