News March 31, 2025

మడకశిరలో పర్యటించిన సత్యసాయి జిల్లా ఎస్పీ

image

మడకశిర పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోగా, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆత్మహత్య చేసుకున్న గృహాన్ని పరిశీలించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Similar News

News April 3, 2025

నేడు కల్వకుర్తికి హరీశ్‌రావు   

image

కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని కడ్తాల్ మండలం ముద్విన్, బోయిన్‌గుట్ట తండాల్లో ఉదయం 10 గంటలకు హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరవుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలను వారు ఆవిష్కరిస్తారని తెలిపారు.

News April 3, 2025

MHBD కలెక్టర్‌ను కలిసిన డీఎంహెచ్ఓ

image

మహబూబాబాద్ జిల్లాకు నూతన వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా వచ్చిన డాక్టర్ బి.రవి బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను ఐడీఓసీలోని కలెక్టర్ చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో ముందంజలో ఉండే విధంగా చూడాలన్నారు. అనంతరం జిల్లాలోని అడిషనల్ కలెక్టర్లను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.

News April 3, 2025

మంత్రి సీతక్క నేడి పర్యటన వివరాలు

image

రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గురువారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు తాడువాయిలోని పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం మంగపేట, ఎటూరు నాగారం, కన్నాయిగూడెం మండలాల్లో సన్న బియ్యం పంపిణీతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 6.30గంటలకు ములుగు చేరుకుంటారు.

error: Content is protected !!