News October 5, 2024

మదనపల్లె: ఒంటరి మహిళపై బండరాళ్లతో దాడి

image

పాత కక్షలతో ప్రత్యర్థులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వితంతు మహిళపై పైశాచిక దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మదనపల్లె మండలం రాయనిచెరువు వడ్డీపల్లిలో జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి అదే ఊరిలో ఉండే గంగులప్పకు ఇంటి విషయమై గొడవలున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆదిలక్ష్మిపై గంగులప్ప వర్గీయులు బండరాళ్లతో శుక్రవారం రాత్రి దాడిచేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News October 5, 2024

వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించిన చంద్రబాబు

image

తిరుమల పాంచజన్యం వెనుక నూతనంగా నిర్మించిన వకుళామాత కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సుమారు రూ.13.45 కోట్లతో ఈ భవనం నిర్మించారు. 1.20 లక్షల మంది భక్తులకు సరిపడే విధంగా భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు.

News October 5, 2024

సీఎం చంద్రబాబు తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం వకుళమాత నూతన కేంద్రీకృత వంటశాలను ప్రారంభించి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే టీటీడీ అధికారులతో సమావేశం అయి తర్వాత తిరుగు ప్రయాణం కానున్నారు. లడ్డూ వ్యవహారం అనంతరం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

News October 5, 2024

చిత్తూరు: తండ్రి బైక్ నడుపుతుండగా కింద పడి బిడ్డ మృతి

image

తండ్రి బైక్ నడుపుతుండగా అదుపు తప్పి కింద పడి బిడ్డ మృత్యువాత చెందిన విషాదకర ఘటన శుక్రవారం రాత్రి గుర్రంకొండలో జరిగింది. ఎస్సై మధు రామచంద్రుడు వివరాల మేరకు.. తంబళ్లపల్లె మండలం కోటకొండకు చెందిన బాబు తన కుమార్తె మేఘన(19)ని గుర్రంకొండలోని బంధువుల ఇంటికి తీసుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వెళ్తుండగా.. గాలివీడు రోడ్డులో బైకుపై నుంచి పడి మేఘన అక్కడికక్కడే మృతి చెందింది.