News April 24, 2025
మద్నూరులో అత్యధిక ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం మద్నూర్, రామారెడ్డిలో 44.8, పల్వంచలో 44.7, జుక్కల్, బాన్సువాడ, డోంగ్లిలో 44.6, నస్రుల్లాబాదులో 44.5, బిచ్కుందలో 44.4, దోమకొండలో 44.1, లింగంపేటలో 43.9, అత్యల్పంగా బీబీపేట మండలంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగవద్దని అధికారులు సూచించారు.
Similar News
News April 25, 2025
నర్సాపూర్(జి): విద్యుత్ షాక్తో రైతు మృతి

విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండలంలో జరిగింది. SI సాయికిరణ్ కథనం ప్రకారం.. డొంగర్గాంక చెందిన విజయ్(51) ఈనెల 11న జంగిపిల్లి చిన్నయ్య పొలంలో మోటర్ పనిచేయకపోవడంతో మోటర్ పరీక్షిస్తున్నారు. ఈ సమయంలో ట్రాన్స్ఫార్మర్కు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లగా HYDలో చికిత్స అందించారు. బుధవారం ఇంటికి తీసుకురాగా.. గురువారం మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
News April 25, 2025
నియమ నిబంధనలు పాటించని ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు: డీఎంహెచ్వో

ములుగు జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో గోపాలరావు అన్నారు. గురువారం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో యాజమాన్యాలతో డీఎంహెచ్వో సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులు తాము అందించే సేవలు,తీసుకునే ఫీజుల వివరాల తో కూడిన ధరల పట్టికను ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని అన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కేసులు పెడతామన్నారు.
News April 25, 2025
NRML: భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందని భర్త సూసైడ్

కుభీర్ మండలం అంతర్నీ గ్రామానికి చెందిన సురేశ్(32) మిషన్ భగీరథ సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. సురేశ్ అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహం చేసుకొని ఇల్లరికం ఉంటున్నాడు. ఈనెల 22న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య వాళ్ల అక్క ఇంటికి వెళ్లిపోయింది. భార్య ఇంట్లోంచి వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన సురేశ్ మిషన్ భగీరథ సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.