News July 28, 2024
మనుబోలులో వ్యక్తిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం
మనుబోలు గ్రామానికి చెందిన మొలకల శశిధర రెడ్డిపై గూడూరు మండలం వెందోడు గ్రామానికి చెందిన మద్దాలి హర్ష వర్ధన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో శశి ధరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 1, 2024
కోర్టు కేసులపై అధికారులు స్పందించాలి: కలెక్టర్ ఆనంద్
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులపై జిల్లా అధికారులు స్పందించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News September 30, 2024
నెల్లూరు: SP కార్యాలయానికి 105 ఫిర్యాదులు
నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్లు ASP CH.సౌజన్య తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు.
News September 30, 2024
SVU : నేడే లాస్ట్ డేట్.. Don’t Miss It
SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.