News June 27, 2024
మస్కట్లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719455904672-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు మస్కట్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాము(42) మూడు నెలల క్రితం మస్కట్కు వెళ్లాడు. అక్కడ బుధవారం రోడ్డు దాటుతుండగా వెనుకనుంచి వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు
Similar News
News February 9, 2025
UPDATE: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయింది వీరే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739026449882_50486028-normal-WIFI.webp)
డిచ్పల్లి మండలం ధర్మారం(బి) గ్రామ శివారులో శనివారం సాయంత్రం కారు చెట్టును ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిచ్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆర్యనగర్కు చెందిన గణేశ్, నరేశ్, రమేశ్, జగన్గా గుర్తించారు. కరీంనగర్ ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ధర్మారంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. గాయాలైన యువకులు చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ షరీఫ్ తెలిపారు.
News February 9, 2025
NZB: ప్రజావాణి తాత్కాలిక వాయిదా: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739022452327_50486028-normal-WIFI.webp)
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని వివరించారు.
News February 8, 2025
ఢిల్లీలో బీజేపీ విజయంపై ఎంపీ అర్వింద్ హర్షం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739009784648_50139228-normal-WIFI.webp)
ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్కే పురం, జంగ్ పుర నుంచి బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్వీందర్ సింగ్ విజయం సాధించడంతో శనివారం ఢిల్లీలో వారిని ఎంపీ కలిసి అభినందించారు. ఈ విజయాన్ని ప్రధాని మోడీకి అంకితం ఇస్తున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.