News June 4, 2024
మహబూబాబాద్: 5 రౌండ్లు పూర్తి.. 83,912 ఓట్ల ఆధిక్యం
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం కౌంటింగ్లో భాగంగా 5వ రౌండ్లో పోలైన ఓట్లు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్కి మొత్తం 1,54,211 ఓట్లు రాగా.. BRS అభ్యర్థి మాలోత్ కవితకు 70,299 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 83,912 ఓట్లతో భారీ మెజార్టీలో ఉన్నారు.
Similar News
News October 1, 2024
నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా
వరంగల్ జిల్లా క్రిస్టియన్ కాలనీలోని సీబీసీ చర్చి నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. అనంతరం మంత్రి దంపతులను పలువురు సభ్యులు ఘనంగా సన్మానించారు.
News October 1, 2024
WGL: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!
సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అని ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.
News October 1, 2024
వరంగల్: మార్కెట్లో పత్తి ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర తటస్తంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ. 7450 పలకగా… నేడు కూడా అదే ధర పలికింది. అలాగే ఈరోజు మార్కెట్ తరలిరాగా రూ. 6910 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గత వారంతో పోలిస్తే ధరలు పడిపోయాయని వ్యాపారులు తెలుపుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది.