News February 25, 2025

మహబూబాబాద్: ఈనెల 27న ఉపాధ్యాయులకు సెలవు 

image

ఈనెల 27న జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదిత ఓటర్లుగా ఉన్నవారు తమ ఓటు వినియోగించుకునేందుకు ఈ ప్రత్యేక సెలవు వర్తిస్తుందని తెలిపారు.

Similar News

News February 25, 2025

SLBC టన్నెల్‌లో 10వేల క్యూబిక్ మీటర్ల బురద?

image

SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్‌లో 15 అడుగుల ఎత్తులో10వేల క్యూబిక్ మీటర్ల బురద ఉందని ఇంజినీర్లు అంచనా వేశారు. దానిని బయటికి తీసేందుకు కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేస్తున్నారు. రేపు సాయంత్రానికి ఈ మరమ్మతు పనులు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా గంటకు 800 టన్నుల బురద బయటకు తోడే అవకాశముంటుందని సమాచారం.

News February 25, 2025

ఏలూరు జిల్లాలో TODAY TOP HEADLINES

image

✷ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ వెట్రిసెల్వి
✷ పట్టిసీమ తిరునాళ్ల పరిశీలించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
✷ జిల్లాలో ముగిసిన ఎన్నికల ప్రచారం
✷ కామవరపుకోటలో పర్యటించిన మంత్రి కొలుసు పార్థసారథి
✷ఈవీఎం భద్రపరిచిన గదులను పరిశీలించిన కలెక్టర్
✷ శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శివాలయాలు
✷ మార్చి 8న మెగా లోక్ అదాలత్
✷ ముగిసిన అంగన్వాడీ జ్ఞాన జ్యోతి కార్యక్రమాలు.

News February 25, 2025

నిర్మల్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

◼️భైంసా : ఏసీబీకి పట్టుబడిన భైంసా SI, కానిస్టేబుల్ 
◼️నిర్మల్ : కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలకు కోర్టు నోటీసులు
◼️భైంసాలో 108 వాహనాలు సీజ్
◼️సోన్ : కడ్తాల్‌లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి 
◼️సోన్‌లో 80 వాహనాలకు జరిమానా
◼️నిర్మల్ : జిల్లాలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

error: Content is protected !!