News April 3, 2025
మహబూబ్నగర్లో SFI, BRSV నాయకుల నిరసన

హెచ్సీయూ భూముల పరిరక్షణ కోసం అక్కడ విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఎస్ఎఫ్ఐ, బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు రాము మాట్లాడుతూ.. హెచ్సీయూ భూముల జోలికి వస్తే సహించేది లేదన్నారు.
Similar News
News April 10, 2025
భారీ వర్ష సూచన.. మెదక్ జిల్లాలో మోస్తారు వర్షాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మెదక్లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడనుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 10, 2025
స్టైల్తో కాదు.. ‘రఫ్’లుక్తో ఇరగదీస్తున్నారు!

హీరో అంటే అందంగా, చొక్కా నలగకుండా స్టైల్గా కనిపించాలనే ధోరణి నుంచి మన హీరోలు బయటికొచ్చేశారు. రఫ్, రగ్గ్డ్ లుక్తో దుమ్మురేపుతున్నారు. పుష్పలో అల్లు అర్జున్, దేవరలో NTR, తండేల్లో నాగచైతన్య, దసరాలో నాని ఇదే తరహాలో కనిపించారు. లేటెస్ట్ మూవీస్ చూస్తే ‘పెద్ది’లో రామ్ చరణ్, ‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండ, ‘ప్యారడైజ్’లో నాని, ‘లెనిన్’లో అఖిల్ గుబురు గడ్డం, దుమ్ముకొట్టుకుపోయిన శరీరాలతో కనిపిస్తున్నారు.
News April 10, 2025
నరసన్నపేట : ముగ్గుల పోటీల్లో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ

ముగ్గుల పోటీలలో నరసన్నపేటకు చెందిన మహిళ రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆంధ్రా అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆన్లైన్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో సునీత మొదటి బహుమతిని గెలుచుకున్నారు. లక్షల రూపాయలు గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.