News February 19, 2025
మహమ్మద్ నగర్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్ నగర్లో జరిగింది. SI శివకుమార్ వివరాలిలా.. మోహన్ (28) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. పాత సామాను ఏరుకొని వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేసేవాడు. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ కాగా, సోమవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి పోయి, స్మశాన వాటిక వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇవాళ మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు కేసు నమోదైంది.
Similar News
News February 22, 2025
అనంతపురం జిల్లా నేటి ముఖ్యాంశాలు ఇవే

☞ గుత్తి వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా.. 20 మంది గాయాలు☞అనంతపురం పెట్రోల్ బంక్ లో మోసం..రూ.2.9 కోట్ల మేర మోసం ☞ తాడిపత్రిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ద్వజారోహణం కార్యక్రమం ☞ టమోటా రైతులు అధైర్యపడవద్దు-ఎమ్మెల్యే పరిటాల సునీత ☞అనంతపురంలో గ్రూప్ 2 వాయిదా నిరసన ☞ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ లక్ష్మీనారాయణ
News February 22, 2025
ప్రకాశం జిల్లా టాప్ న్యూస్

☛ కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ ☛ శ్రీశైలం యాత్రకు 24 గంటలు అనుమతి ☛ ఇంటర్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్: కలెక్టర్ ☛ ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించాలి: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ☛ భర్త పురుగు మందు తాగాడని పోలీసులకు ఫోన్☛ గ్రూప్ – 2 పరీక్షలకు ఏడు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ ☛ చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం ☛ గ్రూప్-2 మెయిన్స్ వ్రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు
News February 22, 2025
ఒక్క గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుద్ది!

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నా కొందరు అడుగు తీసి అడుగేయరు. తాజా అధ్యయనంలో రోజులో ఒక గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. సాధారణ వ్యక్తులు తమ పనికి మరో గంట నడకను జోడిస్తే 6.3 గంటల ఆయుష్షును పెంచుకున్నట్లేనని వెల్లడైంది. నడక కండరాల బలాన్ని & ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు తగ్గించేందుకు నడక అవసరమంటున్నారు. SHARE IT