News February 26, 2025
మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న MHBD అదనపు కలెక్టర్

మహబూబాబాద్ పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థలో రాజయోగిని బ్రహ్మకుమారి సుజాత ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలను మహబూబాబాద్ జాయింట్ కలెక్టర్ విర బ్రహ్మచారి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. ఉత్సవంలో భాగంగా భక్తుల కొరకు శివలింగ క్షీరాభిషేకం, ఎల్ఈడీ శివలింగం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీ సోదర సోరీమణులు దేవి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2025
NZB: స్విమ్మింగ్ పూల్లో మునిగి యువకుడి దుర్మరణం

నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్లో ఇటీవల ప్రారంభించిన స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. నిజాం కాలనీకి చెందిన సయ్యద్ ఆశ్రఫ్(22), అతని అన్నతో కలిసి స్విమ్మింగ్ ఫూల్లో ఈత కొట్టేందుకు వెళ్ళాడు. స్విమ్మింగ్ కోచ్ లేకపోయినా ఆశ్రఫ్ ట్యూబ్ ధరించకపోయినా అతడిని ఈత కొట్టేందుకు అనుమతించారు. దీంతో అతడు లోతుకు వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు.
News February 27, 2025
19మంది డాక్టర్లను అందించిన చిన్న గ్రామం

అకోలి గ్రామ డాక్టర్లు, వారి తల్లిదండ్రుల అభినందన సభ, వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కమ్మల నర్సింలు మాట్లాడారు. తమ గ్రామం 90% అక్షరాస్యత సాధించిందని, ఆ ప్రభావం 19మంది డాక్టర్లు, 34మంది ఉద్యోగులను ఇచ్చిందన్నారు. పీజీ చేసినవారు 23 మంది ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఉదారి నారాయణ పాల్గొన్నారు.
News February 27, 2025
అంతర్జాతీయ సదస్సులో సిద్దిపేట ప్రొఫెసర్కు ప్రశంసా పత్రం

ఈనెల 24, 25న నేపాల్ రాజధాని కాట్మండ్లో బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాల నుంచి పరిశోధకులు పరిశోధనా పత్రాలను ప్రవేశపెట్టారు. జంపన్న వాగు నీటి నాణ్యత పైన చేసిన పరిశోధన పత్రాన్ని ప్రవేశపెట్టిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్ మోహన్కు అంతర్జాతీయ సదస్సులో ప్రశంస పత్రాన్ని అందజేశారు.