News March 16, 2025

‘మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుంది’ 

image

పెనుగొండలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పలు రంగాల్లో రాణించిన స్త్రీలకు మహిళా శిరోమణి పురస్కారాలను మంత్రి సవిత, ఎమ్మెల్యే పరిటాల సునీత లు అందజేశారు. మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ, రాజకీయాల్లో స్త్రీలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రతి మహిళ శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, పోలీసుల సాయం పొందాలని ఎస్పీ రత్న, ఆర్డీఓ సువర్ణ తెలిపారు

Similar News

News March 17, 2025

కాచిగూడ: ‘దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలి’

image

దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలో రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో బీసీలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. దేశ జనాభాలో 60శాతనికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.

News March 17, 2025

భూభారతి చట్టంలోనూ అనేక లోపాలు: మల్లారెడ్డి

image

ధరణిలో లోపాలు పరిష్కరించకుండానే రద్దుచేసి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని ఈ చట్టంలోకూడా లోపాలు ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణలో భూచట్టాలు పరిణామ క్రమం – ధరణి – భూభారతి చట్టాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. భూ సమస్యలు పరిష్కరించకుండా సంవత్సరాల తరబడి కొనసాగిస్తున్న దుస్థితి ఉందన్నారు.

News March 17, 2025

 MDCL: ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట మోసాలతో జాగ్రత్త 

image

రామంతపూర్లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లో రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్ నిర్వహించారు. ఇందులో SEBI ED రామ్మోహన్ రావు మాట్లాడుతూ..ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్, SEBI ద్వారా నిబంధనలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధానాల గురించి తెలుసుకోవచ్చన్నారు.

error: Content is protected !!