News March 31, 2025
మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్రూమ్లో జీలుగుమిల్లి(M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.
Similar News
News April 5, 2025
కాళ్ల: బాబూ జగ్జీవన్ రామ్కు నివాళులర్పించిన కలెక్టర్

కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో భారతదేశ తొలి ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం కలెక్టర్ సి.నాగరాణి నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజంలో అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడని ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News April 5, 2025
ఆచంట: పాము కాటుతో వ్యక్తి మృతి

పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆచంట మండలం అయోధ్యలంకలో జరిగింది. ఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యలంకకు చెందిన శ్రీనివాసరావు గురువారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన సమయంలో పాము కరిచింది. ఇంటికి వచ్చిన తర్వాత అతని నోటి నుంచి నురగ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
News April 5, 2025
పాలకోడేరు: అనుమానాస్ప స్థితిలో కానిస్టేబుల్ మృతి

పాలకోడేరు(M) శృంగవృక్షం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు(37) అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదైంది. ఆకివీడు పీఎస్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చారు. గురువారం అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో భార్య వెళ్లి చూడగా స్పృహతప్పి ఉన్నారు. వైద్యునికి చూపించగా చనిపోయినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.