News February 7, 2025
మాఘమాస వేళ భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు శుక్రవారం ఉదయం అభిషేకం నిర్వహించారు. నేడు మాఘమాసం శుక్రవారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News December 19, 2025
పూర్వోదయ, సాస్కీ పథకాలతో చేయూత ఇవ్వండి: సీఎం

AP: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని వినతి పత్రం అందజేశారు. కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని విన్నవించారు.
News December 19, 2025
భార్యను చంపి 72 ముక్కలు.. హైకోర్టు తీర్పు ఇదే

డెహ్రాడూన్లో భార్యను చంపి 72 ముక్కలుగా నరికేసిన సంచలన కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు దోషి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. నిందితుడు రాజేశ్ గులాటికి జీవిత ఖైదు, రూ.15 లక్షల ఫైన్ విధిస్తూ డెహ్రాడూన్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా రాజేశ్-అనుపమలకు 1999లో వివాహం జరిగింది. మనస్పర్ధలతో 2010 OCT 17న భార్యను చంపి ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచేయగా అదే ఏడాది DEC 12న విషయం బయటికొచ్చింది.
News December 19, 2025
విజయవాడ: మాతృత్వాన్ని మరచిన సరోజ..!

విజయవాడ కబేళా సెంటర్కు చెందిన బలగం సరోజ అలియాస్ సరోజిని పిల్లల విక్రయ ముఠాకు ప్రధాన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. పిల్లల అక్రమ విక్రయాన్ని ఆదాయ వనరుగా మలుచుకుంది. తల్లి ఒడిలో ఉండాల్సిన అభం శుభం తెలియని చిన్నారులను వేలం వేసి విక్రయిస్తోందని దర్యాప్తులో వెల్లడైంది. మహిళగా మాతృత్వాన్ని విస్మరించి, నెలలు నిండని పిల్లలను అక్రమంగా విక్రయిస్తూ మరోసారి పోలీసుల చేతికి చిక్కింది.


