News June 29, 2024

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్‌కు తీవ్ర అస్వస్థత

image

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అర్ధరాత్రి ఉట్నూర్‌లోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎంఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ కోమాలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Similar News

News March 11, 2025

ADB: రేపు జిల్లా స్థాయి హాకీ ఎంపిక పోటీలు

image

ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హాకీ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తెలిపారు. స్టేడియంలో సాయంత్రం 5గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని, ఆసక్తిగల క్రీడాకారులు శిక్షకుడు రవీందర్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు.

News March 11, 2025

గుడిహత్నూర్‌లో శిశువు మృతదేహం కలకలం

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం గురజ గ్రామ శివారులోని వాగులో మంగళవారం ఉదయం మగ శిశువు మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, గుడిహత్నూర్ ఎస్ఐ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.

News March 11, 2025

ADB: రూ.75.31లక్షల కరెంట్ బిల్లు పెండింగ్

image

జిల్లాలోని 447 పాఠశాలల్లో మొత్తం రూ.75.31 లక్షల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. అవి పాత కరెంటు బిల్లులు కావడంతో చెల్లించలేదని, నిధులు మంజూరైనప్పటి నుంచి రెగ్యులర్ బిల్లు చెల్లిస్తున్నామని పలువురు HMలు వివరించారు. కాగా నెల రోజుల్లో బకాయిలు పూర్తి చేయకపోతే కరెంటు సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు.

error: Content is protected !!