News March 1, 2025
మారేడుమిల్లి: పింఛన్లు పంపిణీలో ప్రథమం

అల్లూరి జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీలో మారేడుమిల్లి మండలం 95.61 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని MPDO విశ్వనాధ్ శనివారం తెలిపారు. మండలంలో పలు గ్రామాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంను ఆయన పర్యవేక్షించారు.1935 మందికి పింఛన్లు మంజూరు కాగా 1850 మందికి ఇప్పటి వరకు ఇచ్చామన్నారు. గత 5నెలలుగా ఈ మండలమే ప్రథమంగా నిలుస్తుందని తెలిపారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 1, 2025
విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

➤ ఏయూ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన జి.పి.రాజశేఖర్ ➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ పరీక్షలు➤ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలలో 95 % మంది మొదటిరోజు పరీక్షకు హాజరైన విద్యార్థులు➤ KGHలో శిశువులు మార్పిడి.. ఒకరు సస్పెండ్, ఇద్దరికి చార్జీ మెమోలు➤ సింహాచలం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు➤జిల్లా వ్యాప్తంగా మూడు మిస్సింగ్ కేసులు ఛేదించిన పోలీసులు
News March 1, 2025
ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సన్ని డియోల్ను కలవాలని ఉందని తెలిపారు. ఈ జనరేషన్ నటులు వరుణ్ ధవన్, టైగర్ ష్రాఫ్ గురించి తెలియదని చెప్పారు. అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని పేర్కొన్నారు.
News March 1, 2025
చిత్తూరు: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తెలుగు/హిందీ/సంస్కృతం/ఉర్దూ/తమిళం పరీక్షలకు 14,480 మందికి గాను 13794 మంది విద్యార్థులు హాజరు కాగా, 686 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 2088 మందికి గాను 1885 మంది హాజరు కాగా 203 మంది విద్యార్థులు గైర్హాజరు అయినారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు