News March 23, 2024

మార్చి 25న కోటప్పకొండ గిరి ప్రదక్షిణ

image

మార్చి 25 తేది సోమవారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికూటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 5 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణ సేవాసమితి అధ్యక్షులు అనుమోలు వెంకటచౌదరి మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వద్ద విజయ గణపతి దేవాలయం వద్ద అల్పాహారం, మార్గమధ్యంలో మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News April 20, 2025

పథకాల అమలులో కూటమి విఫలం: వైవీ సుబ్బారెడ్డి

image

ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఎంపీ వై.వి సుబ్బారెడ్డి ఆరోపించారు. గుంటూరు నగర పర్యటనలో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని హామీలకు అనుగుణంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ శ్రేణులను భయపెట్టేందుకు కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఫైర్ అయ్యారు.

News April 20, 2025

గుంటూరు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ

image

ఐఐటీ-జేఈఈ మెయిన్ ఫలితాల్లో విజ్ఞాన్ విద్యార్థులు ప్రతిభ చాటారని విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల కూర్మనాథ్ తెలిపారు. కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 50% మంది 90 పర్సంటైల్ సాధించారన్నారు. విష్ణు కార్తీక్(99.45), శ్రీకాంత్(98.38), విష్ణువర్ధన్(98.05), ఉమేశ్(97.01), ప్రేమ్ సాగర్(96.33) తదితరులు రాణించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు.

News April 19, 2025

కొల్లిపర: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొల్లిపర మండలం బొమ్మువారిపాలెంలో జరిగింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో విద్యార్థిని స్వీటీ(16) ఉత్తీర్ణత సాధించింది. అయితే తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

error: Content is protected !!