News March 31, 2025

మాసాయిపేట: విద్యుత్ షాక్‌తో మృతి

image

మాసాయిపేట మండలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. మాసాయిపేటకు చెందిన గౌరవగల్లు నరసింహులు (42) స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి జారిపడ్డాడు. అదే సమయంలో వాటర్ హీటరు పెట్టిన బకెట్లో చేయ్యిపడి విద్యుత్ షాక్ తగిలింది. విద్యుదాఘాతం ఏర్పడి నరసింహులు అక్కడికక్కడే మృతి చెందినట్లు భార్య సంతోషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News April 3, 2025

మెదక్ జిల్లాలో ముగిసిన టెన్త్ పరీక్షలు

image

మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్ష జరిగింది. రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 10,408 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10,382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొఫెసర్ రాధాకృష్ణ తెలిపారు. 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సంతోషంగా ఇళ్లకు వెళ్లారు.

News April 3, 2025

 వేసవి సెలవులు.. మీ పిల్లలు జాగ్రత్త: మెదక్ ఎస్పీ

image

మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

News April 3, 2025

MDK: ఈనెల 4న విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలపై మెదక్ జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 4న సి.జి.ఆర్.ఎఫ్(కస్స్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఫోరమ్) హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌డే నిర్వహించనున్నట్టు మెదక్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏ.శంకర్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి హాజరయ్యేవారు ఆధార్ కార్డు, కరెంటు బిల్లు రసీదు తీసుకొని రావాలని సూచించారు.

error: Content is protected !!