News March 10, 2025
మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా కోర్టు తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News March 10, 2025
భీమవరం: పీజీఆర్ఎస్కు 367 అర్జీలు

భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి పీజీఆర్కు 367 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పంపించి త్వరగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ తదితరులు పాల్గొన్నారు.
News March 10, 2025
NZB: జిల్లా పంచాయతీ అధికారిగా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా డి.శ్రీనివాస్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా డీపీఓగా ఉన్న ఈయనను ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ కార్యాలయం సిబ్బంది కొత్త డీపీఓకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్ రావు జిల్లా కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు.
News March 10, 2025
అస్సాంకు సొంత ఉపగ్రహం

త్వరలో ‘అస్సాంశాట్’ అనే సొంత ఉపగ్రహాన్ని లాంఛ్ చేయనున్నట్లు అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ప్రకటించారు. సరిహద్దులపై నిఘాకు, కీలక సామాజిక-ఆర్థిక ప్రాజెక్టులపై సమాచారం కోసం ఈ శాటిలైట్ను వాడనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, వ్యవసాయానికి కూడా అది ఉపకరిస్తుందని వివరించారు. ప్రయోగం పూర్తైతే సొంత శాటిలైట్ ఉన్న తొలి రాష్ట్రంగా అస్సాం నిలవనుంది.