News July 17, 2024

ముథోల్: Way2 News ఎఫెక్ట్.. బస్‌స్టాండ్‌లో విద్యుత్ దీపాలు

image

విద్యుత్ దీపాలు లేక ముధోల్ బస్‌స్టాండ్‌లో వారం రోజులుగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. దీనిపై Way2 Newsలో ”అంధకారంలో ముథోల్ ఆర్టీసీ బస్టాండ్” అనే శీర్షికతో కథనం ప్రచురితం అయింది. కథనానికి స్పందించిన అధికారులు బుధవారం బస్టాండ్‌లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.

Similar News

News September 30, 2024

ADB: రేపు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

image

ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ, తెలంగాణ వయోవృద్ధుల సమాఖ్య, ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత పేర్కొన్నారు. వయోవృద్ధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పేర్కొన్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించుచున్నట్లు తెలిపారు.

News September 30, 2024

ఆదిలాబాద్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో STG పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ADBలో 148 పోస్టులకు 4514 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:30గా ఉంది. ASFలో 190 పోస్టులకు 2710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:14గా ఉంది. MNCLలో 165 పోస్టులకు 2527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:15గా ఉంది. NRMLలో 175 పోస్టులకు 2372 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:13గా ఉంది.

News September 30, 2024

జన్నారం: నేడు పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన

image

జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులకు పట్టు పరిశ్రమ/పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు. సోమవారం ఉ.10 గంటలకు జన్నారం పట్టణంలోని పొన్కల్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు వస్తున్నారని వారు వెల్లడించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు కూడా సకాలంలో రావాలని వారు సూచించారు.