News February 9, 2025

ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

image

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Similar News

News February 9, 2025

కాళేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

image

కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాళేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.

News February 9, 2025

మెదక్: 10న జాతీయ నులిపురుగుల నివారణ: డీఈవో

image

మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలలో ఈనెల 10న జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు సంబంధిత ఉపాధ్యాయులు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చూడాలని పేర్కొన్నారు. ఏమైనా సందేహాలుంటే స్థానిక, మండల వైద్యాధికారులు, ఏఎన్ఎంను సంప్రదించాలని సూచించారు.

News February 9, 2025

విజయవాడ: గుణదల తిరునాళ్లకు వచ్చేవారికి గుడ్ న్యూస్ 

image

మేరీ మాత ఉత్సవాలకు వచ్చేవారికై రామవరప్పాడులో కింది రైళ్లకు ఆదివారం నుంచి మంగళవారం వరకు స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. నం.67257 విజయవాడ-నరసాపురం, నం.67258 మచిలీపట్నం-విజయవాడ రైళ్లకు రామవరప్పాడులో స్టాప్ ఇచ్చామన్నారు. అదే విధంగా నేడు ఆదివారం నం.17482 తిరుపతి-బిలాస్‌పూర్, నం.17480 తిరుపతి-పూరి రైళ్లు రామవరప్పాడులో 10,11 తేదీలలో ఆగుతాయన్నారు. 

error: Content is protected !!