News April 23, 2025
ములుగు జిల్లా ఎంపీసీ TOPPERS వీరే

మంగళవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ములుగు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. ఫస్ట్ ఇయర్లో చైత్ర(ప్రభుత్వJr కళాశాల ఏటూరునాగారం)-465, బి.క్రాంతి కుమార్(టీజీ ఆర్ఎస్ బండారుపల్లి) 464, కే.సాయి లహరి(కేజీబీవీ మంగపేట)464, టాపర్లుగా నిలిచారు. పి.చరణ్ తేజ(టీజీఆర్ఎస్ బండారుపల్లి) 993, ఎండీ అస్మి (ప్రభుత్వ జూనియర్ కళాశాల మంగపేట) 984 మార్కులతో టాపర్లుగా నిలిచారు.
Similar News
News April 23, 2025
పాతికేళ్ల క్రితం ఇలాంటి ఉగ్రదాడే..

US వైస్ ప్రెసిడెంట్ వాన్స్ భారత పర్యటనలో ఉండగా జరిగిన ఉగ్రదాడి తరహాలోనే.. పాతికేళ్ల క్రితం అప్పటి US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పర్యటన సమయంలోనూ ఓ అటాక్ జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రమూక భారత ఆర్మీ దుస్తులు ధరించి అనంతనాగ్లోని చిట్టిసింగ్పురాకు వెళ్లారు. పురుషులను గురుద్వారా ముందు లైన్లో నిల్చోబెట్టి కిరాతకంగా కాల్పులు జరిపారు. ఆ ఊచకోతలో 35 మంది సిక్కులు తమ ప్రాణాలు కోల్పోయారు.
News April 23, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా..అత్యధికంగా అచ్చంపేట, వంగూర్, పెద్దకొత్తపల్లి 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తెలకపల్లి 42.1, కొల్లాపూర్ 42.0, వెల్దండ 41.8, కారకొండ 41.5, ఉప్పునుంతల, పెంట్లవెల్లి 41.4, బిజినేపల్లి 41.3, కల్వకుర్తి 41.1, నాగర్ కర్నూల్ 40.9, కోడేరు 40.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 23, 2025
పర్వతాపూర్: భారీ మొత్తంతో చదువు‘కొనాలా’?

పర్వతాపూర్ అరోరా కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తమపై ఫీజుల భారం మోపుతోందని నిరసనకు దిగారు. తరగతులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. ఫీజు చెల్లింపుల్లో పారదర్శకత లేకపోవడం, చెల్లించిన రుసుములకు రసీదు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ప్రాంగణ నియామకాలు చేపట్టడం లేదని విద్యార్థులు గళమెత్తారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు వెనకడుగు వేయమని తేల్చి చెప్పారు.