News February 23, 2025

ములుగు: నేడే గురుకుల పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

image

తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల కింద ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు ములుగు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఉ.11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగుతుంది. విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటల వరకే పరీక్ష సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2025-2026 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.

Similar News

News February 23, 2025

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. <>https://jeemain.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. జనవరిలో జరిగిన ఈ పరీక్షలకు 62,740 మంది హాజరయ్యారు. BArchలో మహారాష్ట్రకు చెందిన నీల్ సందేశ్, B.Planningలో మధ్యప్రదేశ్‌కు చెందిన సునిధి సింగ్ 100 పర్సంటైల్ సాధించారు.

News February 23, 2025

ముగిసిన ఎపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షలు

image

ఆదివారం జరిగిన ఎపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 13 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షలకు 5801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఉదయం పేపర్ 1 పరీక్షకు 5055 మంది హాజరు కాగా 87.14 శాతంగా, మధ్యాహ్నం పేపర్‌-2 పరీక్షకు 5046 మంది హాజరు కాగా 86.99 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

News February 23, 2025

కేంద్ర బడ్జెట్ కార్మిక వ్యక్తిరేక బడ్జెట్: సీఐటీయూ

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక ప్రజావ్యతిరేక బడ్జెట్ అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ అన్నారు. ఆదివారం కార్మిక, వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేటలో సెమినార్ నిర్వాహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బడ్జెట్ రూపొందించారని, ఈ విధానాల వలన కార్మికుల, రైతులుకి భారం పడుతుందన్నారు.

error: Content is protected !!