News March 20, 2025
ములుగు: పది పరీక్షలు.. 144 సెక్షన్ అమలు: SP

రేపటి నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ శబరిశ్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసిందన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, లౌడ్ స్పీకర్లు, మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడవద్దన్నారు.
Similar News
News December 19, 2025
విచారణకు రాని ఫిరాయింపు MLAల కేసు

ఫిరాయింపు MLAల కేసు SCలో ఈరోజు లిస్టయినా విచారణకు రాలేదు. లంచ్ బ్రేక్ తరువాత వస్తుందనుకున్నా ఇతర కేసులతో విచారణ జరగలేదు. SCకి క్రిస్మస్, శీతాకాలం సెలవులు జనవరి 4వరకు ఉంటాయి. ఆ తరువాత కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా సుప్రీం ఇచ్చిన గడువులో స్పీకర్ ఐదుగురు MLAలపై <<18592868>>నిర్ణయం<<>> తీసుకున్నారు. మరో ఐదుగురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసు విచారణకు వచ్చేలోపు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
News December 19, 2025
చామగడ్డ విత్తన దుంపలను ఎలా నిల్వ చేయాలి?

పక్వానికి వచ్చిన చామగడ్డ పంటను తవ్వి కాస్త ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. విత్తన దుంపలను తవ్విన తర్వాత వాటికి కనీసం నెల రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా తవ్విన 4-5 రోజుల తరువాత, దుంపలపై 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను కలిపి దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలంటున్నారు నిపుణులు.
News December 19, 2025
విశాఖ: ‘పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు’

ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ ప్రయోజనాలు అందజేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ పేర్కొన్నారు. శుక్రవారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామన్నారు.


