News February 26, 2025

మెదక్: MLC ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు

image

శాసనమండలి ఎన్నికల కోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 27న జరిగే ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇద్దరు డీఎస్పీలు, 7 ఎస్ఐలు, 41మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, 106 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 18 మంది హోం గార్డులు, మొత్తం 174 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాలో మొత్తం 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Similar News

News February 26, 2025

ఏడుపాయల బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ

image

పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమాత వద్ద భారీ ఎత్తున జాతర ఉత్సవాల నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.

News February 26, 2025

MLC ఎన్నికలకు 174 మందితో బందోబస్త్: ఎస్పీ

image

రేపు జరుగనున్న MLC ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 8 రూట్లలో ఆయుధ పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతుందన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, QRTలు, డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు.

News February 26, 2025

పాపన్నపేట: యువకుడి మృతదేహం లభ్యం

image

ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదన్నారు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉండి ఒంటిపై పచ్చని టీ షర్ట్, నల్లని షర్ట్, నిక్కరు ఉందని, ఆచూకీ తెలిస్తే స్టోషన్‌లో సంప్రదించాలన్నారు.

error: Content is protected !!