News February 6, 2025

మెదక్: అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం

image

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని తగులబెట్టారు. తల సగం కాలింది. ఆస్థి పంజరం మహిళదా? పురుషుడిదా? అనేది తేలాల్సి ఉంది. ఘటనా స్థలానికి హవేలి ఘనపూర్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం లభ్యం కావడంతో పరిసర గ్రామాల్లో ఎవరైనా కనిపించకుండా పోయారా అని ఆరా తీస్తున్నారు.

Similar News

News February 6, 2025

మెదక్: ఏడుపాయల ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

image

ఏడుపాయల ఆలయం పార్కింగ్ నియంత్రణపై శాశ్వత పరిష్కారానికి పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏడుపాయల ఆలయం పార్కింగ్ నియంత్రణకు శాశ్వత పరిష్కారం, మహాశివరాత్రి పర్వదినం, జాతర నిర్వహణకు శాఖల వారీగా కార్యచరణ పై చర్చించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.

News February 6, 2025

మెదక్: కుంభమేళకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ఉత్తరప్రదేశ్‌లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం డిలాయ్ (కూచారం) కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. డిలాయ్ మెరుగు రవీందర్ యాదవ్ (45), గజ్వేల్ మండలం ఆరేపల్లికి చెందిన బామ్మర్ది భిక్షపతి కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్య వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. రవీందర్ మృతిచెందగా, కొడుకు క్రువిత్, బామ్మర్ది తిరుపతి గాయపడ్డారు.

News February 6, 2025

తూప్రాన్‌లో వ్యక్తి కుళ్లిన శవం లభ్యం

image

తూప్రాన్ పట్టణంలో ఓ ఇంట్లో వ్యక్తి కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన వడియారం మల్లేశం(48) భార్యా పిల్లలతో గొడవ కారణంగా ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన మల్లేశం ఇంట్లో 10 రోజుల క్రితం చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. దుర్వాసన రావడంతో ఈరోజు తలుపులు తొలగించి చూడగా మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

error: Content is protected !!