News January 28, 2025
మెదక్: ఇంటర్ ప్రయోగ పరీక్షలు పటిష్ఠగా నిర్వహించాలి: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, సంబంధిత అధికారులతో కలిసి జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించడంపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 6,660 మంది ఫస్ట్ ఇయర్, 6418 మంది సెకెండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం 12,484 మంది ప్రయోగ పరీక్షకు హాజరు కానున్నారు.
Similar News
News March 14, 2025
సిద్దిపేట జిల్లాలో బాలిక ఆత్మహత్య

జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలో కడుపునొప్పి భరించలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నర్ర బాలేశం, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ప్రవళిక(13) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి నిన్న తిరిగొచ్చింది. కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2025
హోలీ పిడిగుద్దులాట.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

హోలీ సందర్భంగా శివంపేట మండలం <<15752874>>కొంతాన్పల్లి<<>>లో నిర్వహించిన పిడుగుద్దులాటలో ఘర్షణ వాతావరణం నెలకొంది. హోలీని పురస్కరించుకొని ప్రతి ఏటా సంప్రదాయం ప్రకారం పిడితాడు లాగుతూ పిడుగుద్దులాటం ఇక్కడ ఆనవాయితీ. కాగా ఇందులో ఎస్సీ కలకంటి వర్గం పాల్గొంటామని చెప్పడంతో పతందార్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తూప్రాన్ సీఐ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య కార్యక్రమం నిర్వహించారు.
News March 14, 2025
నీటి ఎద్దడిలో రైతులకు సూచనలు.. Way2news స్పెషల్

వేసవి సమీపిస్తున్న వేళ రైతులు పంటలకు తడులు వేసే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ తెలిపారు. ఆయన నర్సాపూర్లో Way2newsతో మాట్లాడుతూ.. జిల్లాలో 2,58,487 ఎకరాలో వరి, 8321 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో నీటి ఎద్దడి నేపథ్యంలో రైతుల నీటిని పొదుపుగా వాడుకొని పంటలు సాగుచేసుకోవాలని సూచించారు.