News March 25, 2025
మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు

మెదక్ జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. చిలప్ చెడ్ 36.8, కుల్చారం 36.7, వెల్దుర్తి 36.5, మెదక్ 36.4, పాపాన్నపేట్ 36.3, రేగోడ్ 36.1, అల్లాదుర్గ్ 36.0, పెద్ద శంకరంపేట 35.8, టేక్మాల్ 35.7, హవేలి ఘనపూర్ 35.6, నర్సాపూర్ 35.4, కౌడిపల్లి 35.1, మాసాయిపేట 34.9°C జిల్లాలోని గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 29, 2025
సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. UPDATE

అమీన్పూర్లో <<15910567>>ముగ్గురు పిల్లలు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్గా ఉందని ఆస్పత్రికి తరలించారు.
News March 29, 2025
సంగారెడ్డి: టైలరింగ్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డిలోని ఎస్బీఐ గ్రామీణ శిక్షణ కేంద్రంలో టైలరింగ్ ఉచిత శిక్షణ కోసం గ్రామీణ ప్రాంత మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 సంవత్సరాలలోపు మహిళలు అర్హులని చెప్పారు. తెల్ల రేషన్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 29, 2025
చరిత్రకు వారధులు కవులు: నందిని సిధారెడ్డి

చరిత్రకు వారధులు కవులు అని, చరిత్ర భావి తరాలకు తెలియాలంటే కవుల కలాలు కదిలించాలని తెలంగాణ తెలుగు సాహిత్య అకాడమి మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్ లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. సిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అన్ని ఉద్యమాల్లో కవితోద్యమం ఎంతో గొప్పది అన్నారు.