News March 18, 2025
మెదక్: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
Similar News
News March 19, 2025
నిజాంపేట: తల్లిదండ్రులు మందలించడంతో యువకుడి సూసైడ్ UPDATE

నిజాంపేట మండలం కేంద్రానికి చెందిన యువకుడు సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలిలా.. గరుగుల భాను(18) ఇంటర్మీడియట్లో ఫెయిల్ కావడంతో ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో ఏదైనా పని చూసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. ఈ క్రమంలో మస్తాపానికి గురైన భాను మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకున్నాడు. ఈమేరకు మృతుడి తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 19, 2025
మెదక్ జిల్లాలో వెయ్యేళ్ల నాటి శిల్పాలు

చిన్నశంకరంపేట మండలం మడూరు శివాలయం వద్ద అద్భుతంగా చెక్కిన రాష్ట్రకూట, కళ్యాణిచాళుక్య, కాకతీయ శైలుల శిల్పాలు లభించాయని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు బుర్ర సంతోష్ తెలిపారు. కళ్యాణి చాళుక్య శైలిలో ఆభరణాలతో చెక్కిన యోగశయనమూర్తి విగ్రహం యోగముద్రలో శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి శిల్పం ద్వారపాలకులు, అష్టభుజ మహిషాసురమర్ధిని, సరస్వతీ దేవి విగ్రహం, చతుర్భుజ విష్ణు విగ్రహాలు ఉన్నాయన్నారు.
News March 19, 2025
ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి దామోదర్ కామెంట్స్

ఎస్సీ వర్గీకరణ హేతు వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇదో చారిత్రాత్మకమైన రోజు అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వివక్షను రూపుమాపేందుకు తెచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ బిల్లును తెచ్చామని మంత్రి వెల్లడించారు.