News February 20, 2025
మెదక్: బీఆర్ఎస్ సమావేశానికి మాజీ జడ్పీ ఛైర్ పర్సన్

తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. మెదక్ జడ్పీ ఛైర్ పర్సన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్దిపేట జడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ, వంటేరు ప్రతాపరెడ్డి, చింత ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.
Similar News
News April 22, 2025
Inter Results: మెదక్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 5572 మంది పరీక్షలు రాయగా 3428 మంది ఉత్తీర్ణతతో 61.52 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్లో 6153 మందికి 3028 మంది పాసయ్యారు. 49.24 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.
News April 22, 2025
మెదక్: నేడే తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

జిల్లాలో మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం విద్యార్థులు 12,484 పరీక్షలు రాశారు. ఇందులో ఒకేషనల్ కలుపుకొని ప్రథమ సంవత్సరం 6,066 మంది, ద్వితీయ సంవత్సరం 6,418 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ మాధవి తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST
News April 22, 2025
మెదక్: రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా, మండల స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం దరఖాస్తులు ఈనెల 24 వరకు స్వీకరిస్తున్నట్లు మెదక్ డీఈఓ రాధా కిషన్ తెలిపారు. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ వారి ఆదేశానుసారం 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించి 28న ప్రకటిస్తారన్నారు.