News March 15, 2025
మెదక్: రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీఓ సమావేశం

మెదక్ ఆర్డీవో రమాదేవి తన కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఫారం-6, 8ల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా నిరంతర నమోదు, బూత్ స్థాయి ప్రతినిధుల నియామకం గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. తహసీల్దార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
TB పేషెంట్స్కు ఉచితంగా పౌష్టికాహారం: మంత్రి దామోదర్

తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TB పేషెంట్లకు ఫుడ్ కిట్లను అందించేందుకు అసోసియేషన్ తరపున రూ.25 లక్షల(CSR)నిధులను మంత్రి దామోదర్ రాజనర్సింహ కలిసి అందజేశారు. తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అందించిన CSR నిధులను టీబీ పేషెంట్లకు 6 నెలల పాటు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు ఖర్చు పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి డా. క్రిస్టినా పాల్గొన్నారు.
News March 16, 2025
రాజకీయ పార్టీలతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. నూతన ఓటరుగా నమోదు చేసుకున్న ఫారమ్ 6, 7, 8లను పరిశీలించి పూర్తి చేయాలని పేర్కొన్నారు. బిఎల్ఏలు, గ్రామ స్థాయి అధికారులు దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల మీద సందేహాలను నివృత్తి చేయడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల నివేదికలు త్వరగా అందించాలన్నారు.
News March 15, 2025
నర్సాపూర్: నాటు తుపాకులతో తిరుగుతున్న 8 మంది అరెస్ట్

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటకు నాటు తుపాకీలతో తిరుగుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై పోలీసు కేసు నమోదైంది. అరెస్టయిన వారిలో యాసిన్, శ్రీకాంత్, కృష్ణ, శంకరయ్య, వీరాస్వామి, పోచయ్య, విజయ్, భాను ప్రసాద్ ఉన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచారు.