News March 8, 2025
మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వివరాలు.. మెదక్లో రెండు బైకులు ఢీకొనడంతో కిరణ్ (26) మృతి చందగా.. హవేళి ఘనపూర్లో శ్మశాన వాటిక కమాన్ను టిప్పర్ ఢీకొని కమాన్ పైకప్పు కూలడంతో మునవార్ (21) మరణించాడు. నర్సాపూర్ మండలంలో రామోజీ(50)ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మృతి చెందాడు. శివ్వంపేటలో గుమ్మల శేఖర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News April 21, 2025
BREAKING: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కారులో చిన్నారులతో సహా 9 మంది ఉండగా ఏడాది బాబు గౌస్, ఆలీ (45), అజీం బేగం(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
రామాయంపేట: బట్టల వ్యాపారి మిస్సింగ్.. కేసు నమోదు

బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. UPకి చెందిన బాబుల్ సింగ్(23 కొంతకాలంగా రామాయంపేటలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న బోడ్మట్పల్లిలో బట్టల వ్యాపారం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని బావ గజేందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 21, 2025
మెదక్: BRS నేతలపై కేసు నమోదు

బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల గోడలపై పార్టీ చిత్రలేఖనం గీసిన బీఆర్ఎస్ నాయకులపై హావేళి ఘణపురం మండల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. మెదక్ పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, నేతలు ఆర్.కె.శ్రీను, జుబేర్, ఫాజిల్లపై కేసు నమోదు చేశారు.