News April 17, 2025

మేడ్చల్: 5నెలలుగా జీతాలు లేవని కార్మికుల వినతి

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గ్రామపంచాయతీలలో పని చేస్తున్న కార్మికులకు గత 5 నెలలుగా జీతాలు రావడంలేదని సీఐటీయూ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్‌ఛార్జి డీపీవో సాంబశివరావుకు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు 5 నెలల నుంచి జీతంఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణ, సుధాకర్, ప్రశాంత్ ఉన్నారు.

Similar News

News April 20, 2025

‘ఎమ్మెల్యే’ మూవీలో నటిస్తున్న నరసరావుపేట MLA

image

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టైటిల్ రోల్‌లో ‘ఎమ్మెల్యే’ సినిమా రూపొందిస్తున్నామని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఇందుకోసం సత్తెనపల్లి మండల పరిధిలోని దూళిపాళ్ల గ్రామ శివారులో శనివారం సినిమా చిత్రీకరణ కోసం లోకేషన్లను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో దిలీప్ రాజా మాట్లాడుతూ త్వరలో షూటింగ్ మొదలుపెడతామన్నారు.

News April 20, 2025

భారీగా పడిపోయిన ‘దొండ’ రేటు!

image

<<16113156>>ఉల్లి,<<>> టమాటా తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో దొండకాయల ధర భారీగా పడిపోయింది. ఇటీవల 10 కిలోల దొండ ధర రూ.300-325 పలకగా ప్రస్తుతం రూ.150-50కి పడిపోయింది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిచోట్ల వ్యాపారులు కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండటంతో పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌లలో కిలో రేటు రూ.20-30 వరకు ఉండటం గమనార్హం.

News April 20, 2025

DSC: అనంతపురం జిల్లాలో పోస్టులు ఇలా..

image

అనంతపురం జిల్లాలో 807 టీచర్ పోస్టులను <<16155926>>భర్తీ<<>> చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్: 37
➤ హిందీ: 28 ➤ ఇంగ్లీష్: 103
➤ గణితం: 43 ➤ఫిజిక్స్: 66
➤ జీవశాస్త్రం: 72 ➤ సోషల్: 111
➤ పీఈటీ: 145 ➤ఎస్జీటీ: 202 ఉన్నాయి.
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో ఫిజిక్స్ 1, జీవశాస్త్రం 1, ఎస్జీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

error: Content is protected !!