News February 13, 2025
మేడ్చల్: DEO, MEO మిస్సింగ్ అని పోలీసులకు ఫిర్యాదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739431057018_50135456-normal-WIFI.webp)
మేడ్చల్ జిల్లాలో విద్యాధికారులు ఉన్నారా అని SFI మేడ్చల్ జిల్లా కార్యదర్శి సంతోష్ ప్రశ్నించారు. పట్టణంలోని క్రిక్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని ఫీజు కట్టలేదని ఇంటికి పంపని ఘటన మరువకముందే, శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజుల వేధింపులకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన మేడ్చల్ డీఈఓ, ఎంఈఓ మిస్సింగ్ అయ్యారని SFI నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News February 13, 2025
తూ.గో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739450813045_50324882-normal-WIFI.webp)
గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీలో నిలిచినట్లు ఏలూరు కలెక్టర్ వెట్రీ సెల్వీ గురువారం తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఎనిమిది మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారన్నారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా 11 మంది నామినేషన్లను తిరస్కరించగా, ఎనిమిది మంది విత్ డ్రా చేసుకున్నారని విత్ డ్రా గడువు ముగిసే సమయానికి 35 మంది పోటీలో ఉన్నారని తెలిపారు.
News February 13, 2025
కరీంనగర్: 13 మంది అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739453841160_51569119-normal-WIFI.webp)
మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీకి 13 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు గురువారం ప్రకటించారు. 12 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు, 1 ఉపాధ్యాయ అభ్యర్థి, మొత్తం 13 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.
News February 13, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC బరిలో 10 మంది
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739456111687_697-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు.