News February 23, 2025

మేడ్చల్: అవుషాపూర్ VBIT కాలేజ్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఘట్‌కేసర్ పీఎస్ పరిధి అవుషాపూర్ వీబీఐటీ కళాశాల సమీపంలో యాష్ లోడ్ లారీ యాక్టివా నడుపుతున్న యశ్వంత్(18) అనే యువకుడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. నల్గొండ జిల్లా బీబీ నగర్ మండలం జమీల్‌పేటకు చెందిన యశ్వంత్, జమీల్‌పేట నుంచి బీబీ నగర్ వైపు వెళ్తుండగా వీబీఐటీ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 24, 2025

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 24)

image

* 1911- తెలుగు రచయిత పిలకా గణపతిశాస్త్రి జననం
* 1948- తమిళనాడు మాజీ సీఎం జయలలిత జననం
* 1951- సాహితీవేత్త, విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి మరణం
* 1980- ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణం
* 2018- అతిలోక సుందరి శ్రీదేవి మరణం(ఫొటోలో)
* 1984- నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు(ఫొటోలో)

News February 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 24, 2025

MNCLజిల్లాలో 58 పోలింగ్ కేంద్రాలు: కలెక్టర్

image

మంచిర్యాల జిల్లాలో ఈ నెల 27న జరగనున్న పట్టభద్రులు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు 40, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు 18 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

error: Content is protected !!