News February 11, 2025
మేడ్చల్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739204642629_15795120-normal-WIFI.webp)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వానికి ఈ వివరాలను పంపామని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం రాగానే అందరికీ కార్డులు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Similar News
News February 11, 2025
గద్వాల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఇలా..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739272803357_52038834-normal-WIFI.webp)
గద్వాల జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల సందడి మొదలైంది. జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, 142 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 255 గ్రామ పంచాయతీలు ఉండగా 3,88,196 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో 12 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ఎర్రవల్లి నూతన మండలం ఏర్పాటు కావడంతో ఆ సంఖ్య 13కు చేరింది.
News February 11, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు: డీఆర్వో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739266238429_51971370-normal-WIFI.webp)
మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని శ్రీ సత్యసాయి జిల్లా డీఆర్వో విజయసారథి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్పతో కలిసి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలకు ఈ ఏడాది 23,730 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. 449 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
News February 11, 2025
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739275508075_653-normal-WIFI.webp)
జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలను ఎన్టీఏ రిలీజ్ చేసింది. అభ్యర్థులు <