News February 3, 2025
మేడ్చల్: పథకాల్లో 60% నిధులు కేంద్రానివే: MP
రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వ 40% నిధులు కేటాయిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కోట్లాది రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిందని, ఇప్పటికీ ఖర్చు పెడుతూ ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర నేతలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.
Similar News
News February 4, 2025
ఖమ్మం: ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగ్
తొమ్మిది మంది ప్రొబేషనరీ సబ్- ఇన్స్పెక్టర్లకు (సివిల్) ఐదు నెలల శిక్షణలో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లను కేటాయిస్తూ.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ట్రైనీ ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకొని ఖమ్మం పోలీస్ కమిషనరేట్కు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. అప్పగించిన శాఖపరమైన భాధ్యతలు సక్రమంగా నిర్వహించాలన్నారు.
News February 4, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 4, 2025
మెదక్: మార్చి 6 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.