News February 23, 2025

యాచారం: మహిళపై అత్యాచారం.. యువకుడికి రిమాండ్

image

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని శనివారం యాచారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. యాచారం మండల పరిధిలోని మాల్‌లో ఉంటున్న మతిస్థిమితంలేని మహిళపై నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లికి చెందిన పోలే శ్రీశైలం (25) అనే యువకుడు గత డిసెంబర్ 9న అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుని గుర్తించి రిమాండ్‌కు తరలించారు. 

Similar News

News February 23, 2025

జిల్లాలో అప్పుడే.. 37.5℃ ఉష్ణోగ్రతలు

image

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం అత్యధికంగా మొగల్‌గిద్దలో 37.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు ప్రోద్దటూర్, కాసులాబాద్, చందానవల్లి, తొమ్మిదిరేకుల 37.4, చుక్కాపూర్‌ 37.3, షాబాద్‌ 37.2, రెడ్డి పల్లి, మొయినాబాద్‌ 37.1, కేతిరెడ్డిపల్లి 37, తుర్కయాంజాల్‌ 36.8, మంగల్‌పల్లి 36.7, కేశంపేట్, యాచారం 36.6, కొత్తూరు, మహేశ్వరం 36.5, తోర్రూర్, కొండూర్గ్‌లో 36.4℃గా నమోదైంది.

News February 23, 2025

ఆదివారం: HYDలో పతనమవుతున్న చికెన్ ధరలు

image

HYDలో చికెన్ ధరలు పతనం అవుతున్నాయి. KG మీద ఏకంగా రూ.18 నుంచి రూ.20 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ 168, విత్‌స్కిన్ KG రూ.148గా ఉండగా.. నేడు మోరోసారి భారీగా పడిపోయాయి. KG స్కిన్‌లెస్ రూ.152, విత్ స్కిన్ రూ. 133 చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. హోల్‌సేల్ దుకాణాల్లో ఇంకా తగ్గించి విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ధర ఎంత?

News February 23, 2025

HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

image

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్‌పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!