News September 13, 2024
యాత్రికుల రక్షణకు చర్యలు ప్రారంభించాం: మంత్రి లోకేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1726203342939-normal-WIFI.webp)
కేదార్ నాథ్లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం, మంత్రి మాట్లాడుతూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, ఈ లోగా యాత్రికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామన్నారు. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.
Similar News
News February 17, 2025
విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739801093967_52001907-normal-WIFI.webp)
10వ తరగతి పరీక్షల విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతవరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం, కలెక్టరేట్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. 30,460 మంది విద్యార్ధులు 150 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.
News February 17, 2025
గుంటూరు: రూ.11లక్షల విలువ గల బైక్లు స్వాధీనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739787752688_51976469-normal-WIFI.webp)
పట్టాభిపురం, చేబ్రోలు, నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులకు సంభందించి రూ. 11లక్షల విలువ గల ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 2.24 లక్షల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. వాటిని ఎస్పీ సతీశ్ కుమార్ మీడియా ముందు ఉంచారు. పార్కింగ్ చేసిన వాహనాలను నకిలీ తాళంతో తీసి దొంగతనం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
News February 17, 2025
GNT: కూలీల మృతిపై సీఎం చంద్రబాబు విచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739770394490_19210675-normal-WIFI.webp)
గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో RTC బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.