News April 25, 2025
యాదాద్రి క్షేత్రంలో నేడు చండీ హోమం

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News April 25, 2025
‘అమ్మా, నాన్నా.. నాకు బతకాలని లేదు’

అంటూ ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. TG జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. ఏడాది కిందట బాబు పుట్టడంతో ప్రసన్న ఉద్యోగం మానేసింది. దీంతో భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు. ఈక్రమంలోనే ఇటీవల పుట్టింటికి వచ్చిన ప్రసన్న అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
News April 25, 2025
చీరాల ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ!

ఉమ్మడి ప్రకాశం(D)లో రాజకీయంగా కీలక స్థానమైన చీరాలలో పాలిటిక్స్ వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, సూరగాని లక్ష్మి తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది.
News April 25, 2025
అల్లూరి: సమస్య తీవ్రతకు అద్దం పట్టే ఫొటో

అల్లూరి సీతారామరాజు జిల్లాలో తాగునీటి కష్టాలకు అద్దం పడుతోంది ఈ ఫొటో. అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ పరిధి తట్టావలసలో చేతిపంపు నుంచి పనిచేయకపోవడంతో తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 కిలోమీటర్ల దూరంలో ఊటనీటిని తెచ్చుకొని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం మంచినీటి కోసం చంటి బిడ్డతో వెళ్తున్న కుటుంబాన్ని ఈ ఫొటోలో చూడొచ్చు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు.