News March 17, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం గిరిప్రదక్షిణ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు 2,097 మంది గైర్హాజరు

జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష (JNVST) ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 20 కేంద్రాల్లో శనివారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 3,776 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, కేవలం 1,679 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. దీంతో ఏకంగా 2,097 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. హాజరు శాతం గణనీయంగా తగ్గింది. పరీక్ష కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ముగిసింది.
News December 13, 2025
మెస్సీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్

HYDలో మెస్సీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. మధ్యాహ్నం కోల్కతాలో అభిమానులు <<18551215>>స్టేడియంలో<<>> రచ్చ చేయడంతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అధికారిక కార్యక్రమం కాకపోయినప్పటికీ ఈవెంట్ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మెస్సీ HYDలో ల్యాండ్ అయినప్పటి నుంచి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసేవరకు ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంది. మెస్సీని తనివితీరా చూసిన అభిమానులూ హ్యాపీగా ఫీలయ్యారు.
News December 13, 2025
MHBD: గ్రామ పంచాయతీ ఎన్నికల సమగ్ర సమాచారం!

బయ్యారం, చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, నరసింహులపేట, పెద్ద వంగర, తొర్రూరు మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 158 సర్పంచ్ స్థానాలకు గాను.. ఇప్పటికే 15 ఏకగ్రీవం అయ్యాయి. 143 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1360 వార్డు మెంబర్ స్థానాలకు గాను.. 255 ఏకగ్రీవం అయ్యాయి. 1105 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.


