News March 13, 2025

యాదాద్రి: ట్యాంకర్లతో పొలాలు తడుపుతున్నారు

image

భువనగిరి మండలం గౌస్‌నగర్‌లో రైతులు ట్యాంకర్ల ద్వారా పొలాలు తడుపుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట ఎండిపోతోందని ట్యాంకర్ నీళ్లు కొనుగోలు చేసి పంట పొలాలను తడుపుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి బస్వాపురం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. 

Similar News

News March 13, 2025

రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా: మేయర్

image

కర్నూలులో మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ బీవై రామయ్య అన్నారు. గురువారం కర్నూలు నగర పాలక కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. 10 తీర్మానాలను, సాధారణ నిధుల నుంచి రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా ఊపారు. మేయర్ మాట్లాడుతూ.. ప్రజా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

News March 13, 2025

సిరిసిల్ల: 19 లోపు సమావేశాలు పూర్తి చేయాలి: ఎన్నికల అధికారి

image

ఈనెల 19వ తేదీలోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో నూతన ఓటరు నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ వివరాల తొలగింపు పూర్తిస్థాయిలో అమలుచేయాలన్నారు. 

News March 13, 2025

WNP: హోలీ పండగపై ఎస్పీ కీలక ప్రకటన.!

image

వనపర్తి జిల్లా ప్రజలు హోలీ పండగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని న్యాచురల్ కలర్స్‌ను వినియోగించి, ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో చేసుకోవాలని జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. జిల్లా ప్రజలు, యువత మద్యం సేవించి వాహనాలను నడపడం, బహిరంగ ప్రదేశాలపై, ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడదు అన్నారు.

error: Content is protected !!